carrot చపాతీ

ఎప్పుడూ ఒకే విధం గా చేస్తే చపాతీ బోర్ గా ఉంటుంది తినాలి అంతే,,దానిలో ఇంక ఏదైనా కలిపితే కాస్త తస్తే,బలం ఉంటుంది అని ఇలాగ ట్రై చేశాను,,


కావలసిన పదార్ధాలు;
గోధుమ పిండి-1 కప్
కార్రోట్ తురుము-1 కప్
వాటర్
విధానము:
చెప్పెదేముందండి,చపాతీ కలపటం వచ్చుకదా మన అందరికి అలాగే ఇది కూడాను,గోధుమ పిండి లో ఈ కార్రోట్ తురుము,కొంచెం నూనె,కొంచెం వాటర్ వేసి పిండి బాగా కలపాలి.ఒక గంట అన్నా నాననివ్వాలి..తర్వాత కొంచెం తక్కువ మంటలో చపాతీలు కాల్చాలి..ఎందుకంటే మరీ పచ్చి గా అనిపిస్తుంది కార్రోట్,,
కూర లేకపోయినా ఇట్లాగైన లాగించేయవచ్చు,పిల్లలకు మంచి ఆహరం..

పూస ఉండలు


మూడు రోజుల క్రితం మా వారు కారప్పూస(అదే sev ) కొన్నారు బోలెడు,అదేమో complete కావటం లేదు అందుకని దాన్ని స్వీట్ గా చేస్తే వెరైటీ గా తినేయొచ్చు అని ఇది గో ఇలాగ మార్చేసా,,బాగుంది తియ్య తియ్యగా.చూడండీ ఎలా చెయ్యాలో.
కావలసిన పదార్ధాలు:

కారప్పూస:2 cups
బెల్లం:1 /2cup
వాటర్:1 /4th కప్
విధానము:
    ముందు గా గిన్నెలో బెల్లం వేసి దానిలో నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టాలి.ఉండపాకం వచ్చేవరకు కలపాలి.
    చిన్న పళ్ళెం లో నీళ్ళు పోసి దానిలో ఈ పాకం వేసి చేత్తో పట్టుకుంటే కొంచెం ఉండలాగా అవుతుంది అలాంటప్పుడు ఈ కారప్పూస వేసేసి బాగా కలిపి స్టవ్ ఆపేయాలి.కొంచెం వేడి గా ఉన్నప్పుడు చేతి కి తడి చేసుకుంటూ ఉండలు చేయాలి.ఆరాక బాగా గట్టి పడతాయి..

లడ్డు

మా బాబు కు లడ్డులంటే భలే ఇష్టం గా తింటాడు,,పాకం తో చేసేవి ఎందుకులే అని కొత్తగా ఉంటుంది అని సున్నిఉండల లాగా ఇది చేసి పెట్టాను,,taste బాగుంటుంది.ఇష్టం గా తిన్నారు ఇంట్లో అందరూ,,చేయటం కూడా సులభమే,,మీరు ట్రై చెయ్యండి..

కావలసిన పదార్ధాలు:
 పెసర పప్పు--1 కప్
పంచదార- 1 కప్
నెయ్యి-2spoon
ఎలాచి -5
జీడి పప్పు,కిస్మిస్ కొద్దిగా
విధానము:
    ముందు గా పెసరపప్పు ను బాండి లో వేసి వేయించాలి.మరీ ఎర్రగా కాకుండా కొంచెం గా వేయించాలి.
    పంచదార,ఎలాచి లను mixi లో వేసి బరకగా పొడి చేసుకోవాలి.
   పెసరపప్పు ను కూడా mixie లో వేసి బరక గా పొడి చేయాలి.
   పంచదార పొడి,పెసర పొడి కలిపి అందులో నెయ్యి లో వేయించిన జీడిపప్పు,కిస్మిస్ వేసి మిగిలిన నెయ్యి ను కూడా వేసి లడ్డు లాగా చుట్టాలి.
 అంతే తియ్య తియ్యని లడ్డు రెడీ..

మరమరాల ఉండలు

  ఇవ్వాళ mother 's   డే సందర్భం గా నేను చేసిన స్వీట్ మరమరాల ఉండలు,,పాతవంటకమే అయినా తొందరగా చాలా సింపుల్ గా చేసేయొచ్చు..అందులోను మా బాబు ఇష్టం గ తింటాడు అనే ఉద్దేశ్యం తో చేసాను,,నాకు అమ్మ పదవిని ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ గా ఇది చేసి పెట్టాను వాడికి...

కావలసిన పదార్ధాలు:
               మరమరాలు : ఒక కప్పు
               బెల్లం: ఒక కప్పు

తయారు చేయు విధానము:
           బెల్లంను ఒక గిన్నెలో తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసి బాగా ఉండపాకం అయ్యేలాగా చేయాలి,,,
           (కొంచెం పాకం స్పూన్ లో తీసుకొని నీళ్ళల్లో వేస్తె గట్టిగ అవుతుంది,,),
           అలా ఉండపాకం అవ్వగానే stouve ఆపేసి మరమరాలు వేసి బాగా కలపాలి.
           కొంచం వేడి గా ఉండగానే చిన్న చిన్న ఉండలు గా చేసుకుంటే.,,బాగా చల్లారాక గట్టిగా అవుతుంది...
           తియ్య తియ్య గ ఉండే మరమరాల ఉండలు రెడీ...

లడ్డు

 పూరీలు చేసినప్పుడు దాదాపు మిగులుతూనే ఉంటాయి..చల్లారినాక  తినాలి అంటే ఎవరూ తినరు..అందుకని మిగిలినవాటిని ఒక్కసారి నూనెలో వేయించి తీస్తే కరకర లాడుతూ వస్తాయి  ....అలాంటివాటిని varitey గ లడ్డు లాగా చేసుకుంటే నిమిషం లో లాగించేయొచ్చు  ...
కావలసినవి:
పూరీల పొడి... 3 గ్లాసులు
పంచదార పొడి... 6 గ్లాసులు
పుట్నాలపొడి... గ్లాసు
కరిగించిన నెయ్యి... గ్లాసు
జీడిపప్పు... 100గ్రా
యాలకుల పొడి... 2 టీస్పూన్లు
విధానము:
పూరీలను  మెత్తగా పొడి చేసి, అందులో పుట్నాలపొడి, పంచదార పొడి, యాలకుల పొడి ఒక పాత్రలో వేసి బాగా కలపాలి.
దాంట్లో నెయ్యి వేస్తూ బాగా ముద్దగా కలపాలి.
తరువాత ఆ మిశ్రమాన్ని లడ్డూల మాదిరిగా చుట్టి జీడిపప్పును అద్దితే వెరైటీ పూరీ లడ్డూలు సిద్ధమైనట్లే...!

గోరు మిట్టీలు

కావలసినవి:
మైదా.. రెండు కప్పులు
బొంబాయి రవ్వ.. రెండు కప్పులు
పంచదార.. నాలుగు కప్పులు
నూనె.. వేయించేందుకు సరిపడా
వెన్న.. తగినంత
విధానము:
గిన్నెలో మైదా, రవ్వ, వెన్న వేసి తగినన్ని నీళ్లుపోసి చపాతీల పిండికంటే కాస్త పలుచగా కలుపుకోవాలి.
ఆ మిశ్రమాన్ని అలాగే 10 నిమిషాలపాటు పక్కనుంచాలి. 
తరువాత ఆ పిండిని తీసి ఓ మోస్తరు ఉండలుగా చేసి, రెండువేళ్ల మధ్యలో ఒక్కో ఉండను ఉంచి నొక్కుతూ పొడవాటి గోళ్లలాగా చేయాలి.
అలా మొత్తం పిండితో చేసుకున్నాక వాటిని బాగా కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించి పక్కనుంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పంచదార తీసుకుని, కాసిన్ని నీళ్లుపోసి ఉండపాకం వచ్చేలా చూడాలి. 
ఈ పాకాన్ని పైన వేయించి పెట్టుకున్న వాటిపై పోసి బాగా కలియబెట్టాలి.
పాకం చల్లారేకొద్దీ వాటికి గట్టిగా పట్టుకుని తెల్లగా కనిపిస్తుంది. అంతే గోరు మీఠీలు తయార్..

చేగోడీలు


కావలసినవి
              బియ్యపు పిండి - 3గ్లాసులు
              మైదా - 1గ్లాసు
              నెయ్యి - 50గ్రా
              వాము - 1/2టీస్పూను
              పసుపు - 1/4టీస్పూను
              కారం - 1/2టీస్పూను
              ఉప్పు - తగినంత
              నూనె - వేయించడానికి సరిపడినంత
విధానము :
           ముందుగా ఒక గిన్నెలో నాలుగు గ్లాసుల నీళ్ళు పోసి ఎసరు పెట్టవలెను.
           దానిలో తగినంత ఉప్పు వేసి ఎసరు మరిగిన తర్వాత స్టవ్ మీది నుంచి దించవలెను.
          ఇప్పుడు వాము,కారంపొడి,పసుపు వేసి వెంటనే మొత్తం బియ్యపుపిండి,మైదాలను కలిపి దానిపైన నెయ్యి పోసి గిన్నెపై మూతపెట్టవలెను.
           పిండి కొంచెం చల్లారిన తర్వాత పిండి ముద్దను రెండు అరిచేతులతో బాగా నలిపి సన్నగా తాడులా పొడవుగాచేసి కావలసిన సైజులో రింగులుగా అంటే గుండ్రంగా చేసి వేడినూనెలో ఎర్రగా వేయించి తీసేయవలెను

పల్లీ చక్రాలు

ఎప్పుడు సెనగపిండి,మినప్పిండి తో నే చక్రాలు చేసి చేసి బోర్ గ ఉంటే ఇది ట్రై చెయ్యండి..
కావలసిన పదార్ధాలు:
     పల్లీలు -250gm
     బియ్యప్పిండి-250gm
     వాము-2tsp
     ఉప్పు,కారం కొద్దిగా
విధానము:
    ముందుగా పల్లీలను  మూడు గంటల పాటు నీళ్ళలో నానపెట్టాలి.
    కొంచెం నీళ్ళు పోసి mixie లో మెత్తగా పిండి చేయండి..
    ఈ పల్లిల పిండి లో బియ్యప్పిండి,వాము,ఉప్పు,కారం కలపాలి.
    ఇంకా నీళ్ళ అవసరం ఉండదు.,.
    దీన్ని చక్రాల గిద్దేలో వేసి కాగిన నూనె లో చక్రాల లాగా వేయండి..
    చాలా రుచి  గ ఉండే చక్రాలు రెడీ,,

పాలకూర వడలు

ఎప్పుడూ పాలకూర పప్పు అంటే బోర్ గ ఫీల్ అయ్యే పిల్లలకు మంచి snack ఇది..
కావలసిన పదార్ధాలు:
      గోధుమపిండి -1 కప్పు
      పెరుగు-1 కప్పు
      పాలకూర -2 కట్టలు
      అల్లం,మిర్చి పేస్టు
      ఉప్పు తగినంత
      జీలకర్ర - 1tbsp
      నూనె వేయించడానికి సరిపడా
విధానము:
     గోధుమ పిండి లో అల్లం,మిర్చి పేస్టు,ఉప్పు,జీలకర్ర,పెరుగు వేసి బాగా కలపాలి.
     పాలకూర ను శుభ్రం గ కడిగి ఆకులను సన్నగా తరగాలి.
     ఈ ఆకులను పిండి లో కలపాలి.
     పది నిమిషాల తర్వాత బండి లో నూనె వేడిచేసాక ఈ పిండి ను చిన్న నిమ్మకాయ అంత సైజు లో తీసుకొని పాల కవర్ ఫై వడ మాదిరి వత్తాలి.
    నూనె లో వేసి ఎర్రగా కాలినాక తీయాలి..
 

రవ్వ పకోడీ

ఎప్పుడు సెనగ పిండి తో నే కాకుండా వెరైటీ గ ఈ పకోడీ కుడా చేసుకోవచ్చు
కావలసిన పదార్ధాలు:
       బొంబాయి రవ్వ: 2 కప్పులు
      ఉల్లిపాయ -2
      ధనియాల పొడి : 2tbsp
      అల్లం,వెల్లుల్లి పేస్టు -1tbsp
      పసుపు చిటికెడు
      ఉప్పు తగినంత
      సోడా ఉప్పు కొద్దిగా
      పెరుగు -౧/౨ కప్పు
 విధానము:
      ఉల్లిపాయ ను సన్నగా తరగాలి
      ఉల్లి,ఉప్పు,కారం,అల్లం వెల్లుల్లి పేస్టు,పసుపు,సోడా ఉప్పు అన్ని బొంబాయి రవ్వ లో వేసి పెరుగు తో కలపాలి.
      పకోడిలా పిండి మాదిరి కలపాలి
      బాండి లో నూనె కాగాక పకోడీ లాగ వేసి ఎర్రగా కాలినాక తీసేయడమే   ..

రవ్వ దోసె

కావలసిన పదార్ధాలు:
         మైదా పిండి - 1 కప్
         బియ్యప్పిండి -2 cups
         బొంబాయి రవ్వ- 1/2 కప్
         మిర్చి,అల్లం పేస్టు - 2tbsp
         ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి -1 /2 కప్
  విధానము:
        బొంబాయి రవ్వ,బియ్యప్పిండి,మైదా పిండి లను గిన్నెలో వేసి కాసిని నీళ్ళు పోసి దోసెల పిండి లాగ చేయాలి..దోసెల పిండి   కన్నా కొద్దిగా పలచనగా చేయాలి..
       దీనిలో అల్లం,మిర్చి పేస్టు వేయాలి.
      ఒక 15 నిముషాలు తర్వాత దోసెపిండి ని బాగా కలిపి దోసె పోయాలి...
      దోసె పైన ఉల్లి ముక్కలు వేయాలి..బాగా కాలినాక తీయాలి.

చీలా

  కావలసిన పదార్ధాలు:
       సెనగ  పిండి: 1 కప్
       బొంబాయి రవ్వ: 1 /2   కప్
       కారం : 1 tbsp
       ఉల్లిపాయ ముక్కలు : 1 కప్
       పచ్చి మిర్చి ముక్కలు (సన్నగా తరగాలి) -2tbsp
       ఉప్పు తగినంత
       వంట సోడా  కొద్దిగా
   విధానము:
        ఒక గిన్నెలో సెనగపిండి,బొంబాయి రవ్వ,కారం,వంటసోడా,ఉప్పు వేసి నీటి తో పిండి లా కలపాలి.
        పదిహేను నిముషాలు అయ్యాక ఉల్లిపాయ,మిర్చి ముక్కలు వేయాలి.
        పెనం పైన దోసె లా పోసి రెండు వైపులా కాల్చాలి.
       దీన్నే సెనగపిండి బదులు గోధుమ పిండి తో కుడా ఇదేవిధం గ చేసుకోవచ్చు..

పుల్లట్లు


కావలసిన  పదార్ధాలు : 
     పుల్లటిమజ్జిగ: 3 కప్పులు, 
    బియ్యం: కప్పు, 
    మెంతులు: 2 టీస్పూన్లు, 
    జీలకర్ర: స్పూను, 
   పచ్చిమిరపకాయలు: ఆరు, 
   ఉప్పు: తగినంత,  నూనె
తయారుచేసే విధానం:-
      మజ్జిగలో బియ్యం, మెంతులు నానబెట్టాలి. నాలుగు గంటల తరవాత మెత్తగా రుబ్బుకోవాలి.
      పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర.. దంచి పిండిలో కలిపి దోసెలపిండి మాదిరిగా పలుచగా చేసుకోవాలి.
      పెనంమీద కొద్దిగా నూనె రాసి పిండితో దోసె వేసి రెండువైపులా కాల్చి తియ్యాలి.

రవ్వ పులిహోర


కావలసినవి
బియ్యంరవ్వ: 2 కప్పులు, నిమ్మకాయలు: 2, ఇంగువ: అరటీస్పూను, వేరుసెనగ గింజలు: టేబుల్‌స్పూను, ఉప్పు: సరిపడా, నూనె: 6 టీస్పూన్లు, పసుపు: టీస్పూను, కరివేపాకు: 4 రెబ్బలు, పచ్చిమిర్చి: 2, పోపుకోసం: ఆవాలు: అరటీస్పూను, ఎండుమిర్చి: 2, సెనగపప్పు: 2 టీస్పూన్లు, మినప్పప్పు: 2 టీస్పూన్లు
తయారుచేసే విధానం
బియ్యం రవ్వలో పసుపు, టీస్పూను ఉప్పు, టీస్పూను నూనె వేసి ఒకటికి రెండు చొప్పున నాలుగు కప్పుల నీళ్లు పోసి కుక్కర్‌లో ఉడికించాలి. 3 విజిల్స్‌ వచ్చాక దించి ఉడికిన రవ్వను పొడిపొడిగా చేసి చల్లారనివ్వాలి.
 బాణలిలో 5 టీస్పూన్ల నూనె వేసి పచ్చిమిర్చి, ఇంగువ, వేరుసెనగగింజలు వేసి వేగాక మిగిలిన పోపు దినుసులు కూడా వేసి కరివేపాకు వేసి చిటపటమన్నాక దించాలి.
ఈ తాలింపులోనే నిమ్మరసం పిండి, సరిపడా ఉప్పు వేసి రవ్వలో కలపాలి. చివరగా కొత్తిమీర చల్లితే నోరూరించే రవ్వ పులిహోర రెడీ. ఇష్టమైతే క్యారెట్‌ తురుము కూడా కలుపుకోవచ్చు.

carrot kulfi

మొన్న  ఆ   మధ్య  tv లో   కుల్ఫీ  చేయటం  చూపించారు  నేను  దానిలో  వెరైటీ  గ  ఉంటుంది  అని  కార్రోట్  కూడా  వేసాను ..మా  బాబు  కు  బాగా  నచ్చింది..మీరు  ట్రై  చేయండి ..
   కావలసిన  పదార్ధాలు :
                కార్రోట్ తురుము -1cup
                బ్రెడ్ స్లిసుస్ (అంచులు తీసేసినవి)-5
               పాలు-1 /2litre
               బాదం,జీడి పప్పులు-1 /2 కప్
   విధానము:
   carrot తురుమును కొద్దిగా నెయ్యి వేసి  పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
   పాలు బాగా మరిగాక ఈ carrot తురుము వేయాలి.
  నెయ్యి లో బాదం,జీడి ముక్కలు వేయించాలి.
  ఈ పాల లో బాదం,జీడి ముక్కలు వేసి carrot బాగా ఉడికినాక బ్రెడ్ slices   ను బాగా పొడి చేసి పాలల్లో కలపాలి.
  బాగా కలుపుతూ ఉండాలి..ఉండ కట్ట కుండా.
  బాగా దగ్గర పడినాక కొంచెం చల్లరనిచ్చి deep fridge లో పెట్టి bowels లో సర్వే చేయాలి.

               
           

కొబ్బరి వడలు

         
   కావలసిన  పదార్ధాలు :   
             బియ్యంపిండి: ఒక కప్పు,                                                     జీలకర్ర: కొద్దిగా,
              మైదా: అరకప్పు,                                                                ఉప్పు: తగినంత,
              కొబ్బరి చిప్ప: సగం,                                                            నీళ్ళు: ఒకటిన్నర కప్పులు
             పచ్చిమిరపకాయలు: ఆరు,                                                నూనె 
తయారుచేసేవిధానం:-
         ముందుగా కొబ్బరి తురిమి ఉంచాలి. మైదా, బియ్యంపిండి కొబ్బరి తురుముతో కలపాలి.
         అడుగు మందంగా ఉన్న గిన్నెలో ఒకటిన్నర కప్పుల నీళ్ళు పోసి స్టవ్‌మీద పెట్టాలి.
         పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర గ్రైండ్‌ చేసి నీళ్లలో వెయ్యాలి.
         నీళ్ళు మరిగిన తరవాత ఒక స్పూను నూనె వేసి పిండి పోసి బాగా కలిపి దించాలి.
         చల్లారిన తరవాత కొద్దిగా నూనె రాసి నిమ్మకాయంత పిండి తీసుకుని, గుండ్రంగా వత్తి ఎర్రగా కాగిన నూనెలో వేయించి    తియ్యాలి.
        ఇవి వేడివేడిగా తింటే బాగుంటాయి

కొబ్బరి కేకు




Âë-©-®ÏÊ X¾ŸÄ-ªÃn©Õ: 
     X¾*a-Âí-¦sJ Ōժ½Õ«á - ఒక కప్పు                                ¹J-T¢-*Ê ¯çªáu రెండు కప్పులు 
     ¬ëÊ-’¹-XÏ¢œË, ఒక కప్పు                                            పంచదార  రెండు కప్పులు
     ¤Ä©Õ ఒక ¹X¾Ûp 
  విధానము:  
    X¾ŸÄ-ªÃn-©Fo ‹ ¤Ä“ÅŒ-©ðÂË B®¾Õ-Âî-„ÃL. ®¾Êo-E-«Õ¢-{åXj ¦ÇºL åXšËd.. «á¢Ÿ¿Õ’à ¹LXÏ åX{Õd-¹×Êo NÕ“¬Á-«Ö-Êo¢Åà ƢŸ¿Õ©ð „ä®Ï.. ¹©Õ-X¾ÛÅŒÖ …¢œÄL. -Æ-©Çê’ -«-C-©äæ®h NÕ“¬Á«Õ¢ «ÖœË-¤ò-ÅŒÕ-¢-C. Æ«-®¾-ª½-„çÕiÅä ƒ¢Âî¾h ¯çªáu Í䪽Õa-Âî-«ÍŒÕa. NÕ“¬Á«Õ¢ Âî¾h ’¹šËd-X¾-œÄf¹.. \¢ Íä§ŒÖ-©¢˜ä.. *Êo-¹-X¾Ûp©ð Fª½Õ B®¾Õ-¹×E ƪ½-Íç¢Íà XÏ¢œËE ƒ¢Ÿ¿Õ©ð „ä§ŒÖL. FšË©ð „ä®ÏÊ XÏ¢œË ’¹šËd-X¾-œËÅä êÂÂú ÅŒ§ŒÖ-éªj-ʘäx.  ¯çªáu-ªÃ-®ÏÊ æXx{Õ©ð „ä®Ï.. Ê*aÊ ‚¹%-A©ð Âî®Ï¯Ã ®¾J-¤ò-ŌբC

ఆలు కచోరి

కావలసిన  పదార్ధాలు :

    ¦¢’Ã-@Á-Ÿ¿Õ¢X¾©Õ Ð ‰Ÿ¿Õ (…œË-ÂË¢* «áŸ¿l©Ç Í䮾Õ-Âî-„ÃL),            X¾*a-NÕJa Ð «âœ¿Õ
    „çÕiŸÄ Ð ¯Ã©Õ’¹Õ ¹X¾Ûp©Õ,                                     Æ©x¢«á¹ˆ©Õ
    …X¾Ûp Ð ÅŒT-ʢŌ,                                           Ÿµ¿E§ŒÕ©Õ, °©-¹-“ª½-¤ñœ
    ¯çªáu Ð ¯Ã©Õ’¹Õ ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕx,                                పసుపు
    ’¹ª½¢-«Õ-²Ä-©ÇÐ-Íç¢Íà ÍíX¾ÛpÊ,                                  E«Õt-ª½®¾¢ Ð Íç¢ÍÃ, 
    ®¾Êo’à ŌJ-TÊ ÂíAh-OÕª½                                      Fª½Õ Рƪ½-¹X¾Ûp,
       నూనె
విధానము 
         „çÕiŸÄ-XÏ¢-œËÂË ¯çªáu, X¾Û©x åXª½Õ’¹Õ, …X¾Ûp ÍäJa ÍŒ©xE FšËÅî «áŸ¿l©Ç ¹©-¤ÄL. DEåXj „çÕÅŒhE ÅŒœË «®¾Y¢ ¹XÏp    ƪ½-’¹¢{ ¯ÃÊ-E-„ÃyL. «Õªî ¤Ä“ÅŒ©ð ÊÖ¯ç ÅŒX¾p NÕT-LÊ X¾ŸÄ-ªÃn-©Fo «áŸ¿l©Ç ¹©-¤ÄL. *Êo-*Êo …¢œ¿©Çx Íä®Ï X¾Â¹ˆ-Ê-åX-šÇdL. ¯ÃÊ-¦ã-šËdÊ „çÕiŸÄ-XÏ¢œËE «Õ¢Ÿ¿¢’à X¾ÜK©Ç «Ah Æ¢Ÿ¿Õ©ð ¦¢’Ã-@Á-Ÿ¿Õ¢X¾ …¢œ¿E …¢*.. *«ª½Õx «âæ®-§ŒÖL. ¦Çº-L©ð ÊÖ¯ç ÂÒù.. ŠÂîˆ Â¹Íî-JE ¦¢’Ã-ª½Õ-«-ª½g¢-©ð-ÂË «Íäa-ŸÄÂà „äªá¢-ÍÃL. „äœË-„äœË ‚©Ö ¹ÍîJ ®ÏŸ¿l´¢. {«ÖšÇ ²Ä®ýÅî ¹LXÏ A¢˜ä ‚ ª½ÕÍä „äª½Õ

వంటల చిట్కాలు

ఇడ్లి పిండి పల్చగా ఉంటే దానిలో కొద్దిగా బొంబాయి రవ్వ కలపాలి.
ఉప్మా తయారికి పోపు వేయించి నీళ్ళకు బదులు కాసిని పాలు పోస్తే రుచిగా ఉంటుంది.
పెరుగు పులిస్తే పారవేయకుండా వడకట్టి మళ్ళి గోరువెచ్చటి పాలు కలిపితే తాజా  పెరుగు తయారు అవుతుంది. 
దోసె పిండి పులిస్తే దానిలో నాలుగు స్పూన్లు మైదా పిండి వేసి బాగా కలిపి దోసెలు వేస్తె కరకర లాడుతాయి. 
దోసెల పిండి తో పాటు ఉడికించిన ఒక బంగాళదుంప ను కుడా వేసి రుబ్బితే దోసెలు రుచికరం గ ఉంటాయి. 
మినప గారెలు ఎర్రగా దోరగా వేగాలి అంటే బాణలి లో వేసే ముందు చేతిని మజ్జిగ తో తడి చేసుకోవాలి.
చపాతీలు మృదువు గా ఉండాలి అంటే పిండి కలిపేటప్పుడు కొద్దిగా పాలు కలిపితే సరి.
దోసెలు పల్చగా రావాలి అంటే ఒక కప్పు సగ్గుబియ్యం నానబెట్టి వేసి రుబ్బాలి.

పూరీలు  బాగా పొంగాలి అంటే గోధుమ పిండి తో చేస్తే కొంచెం మందం గ వత్తాలి
పూరీలు  మైదా పిండి తో చేస్తే కొంచం పల్చగా వత్తాలి.
పకోడీలు/బజ్జీలు వండేప్పుడు సెనగపిండి కి 1 /2 కప్పు పెరుగు చేరిస్తే రుచి గా ఉంటాయి.
సేమ్యా ఉప్మా లో నీళ్ళు ఎక్కువగా ఉండి ముద్దగా ఉంటే కొంచెం బొంబాయి రవ్వ వేయాలి.
‚¹×-X¾-ÍŒaE ¹ت½-’Ã-§ŒÕ©Õ, ‚¹×-¹ت½©ÊÕ …œË-ÂË¢-Í-ä-{-X¾Ûpœ¿Õ *šË-éœ¿Õ X¾¢ÍŒ-ŸÄª½ „äæ®h ¹ت½ X¾ÍŒaŸ¿Ê¢ Âî©ðp-¹עœÄ, ª½Õ*’à …¢{Õ¢C

Ÿî¬Á©Õ ª½Õ*’à ¹ª½-¹-ª½-©Ç-œ¿ÕÅŒÖ ªÃ„Ã-©¢˜ä XÏ¢œË©ð Âî¾h X¾¢ÍŒ-ŸÄª½ „äæ®h ®¾J
åXª½Õ’¹Õ ’Ãéª©Õ Íäæ®-«á¢Ÿ¿Õ åXª½Õ-’¹Õ¹×.. ª½ÕGsÊ X¾*a-NÕJa, Âí¦s-JÂË.. Íç¢Íà ¤Ä©Õ, ‚„Ã-©-¤ñœË ¹L-XÏÅä ’Ãéª©Õ ª½Õ*’à «²Ähªá
ఇడ్లీలు పులిసి వాసన రాకుండా రుచిగా ఉండాలి అంటే పిండి రుబ్బేటప్పుడు కొంచం నానిన సగ్గుబియం కలపాలి.
ª½«y-©œ¿Öf Í䧌֩-ÊÕ-¹ע-{Õ-¯ÃoªÃ? X¾¢ÍŒ-ŸÄª½ ¤Ä¹¢ «ÍÃa¹ Íç¢Íà ¤Ä©Õ Æ¢Ÿ¿Õ©ð ¹L-XÏÅä.. …¢œ¿©Õ ͌՘äd ŸÄÂà XÏ¢œË ’¹šËd-X¾-œ¿Ÿ¿Õ  
X¾¢ÍŒŸÄª½ ¤Ä¹¢ X¾šÇd¹ ƪá-ŸÄª½Õ ͌չˆ© E«Õt-ª½®¾¢ ¹©-X¾¢œË. ¤Ä¹¢ *¹ˆ’à …¯Ão ͌鈪½ åXjÂË Å䩟¿Õ
గారెల పిండిలో కొద్దిగా సేమ్యా వేయించి కలిపితే మంచి రుచిగా ఉంటాయి. తినేటప్పుడు గారెలు కరకరలాడుతాయి 
అరటి కాయలు వంకాయలు కోసిన కాసేపటికే రంగు మారి కసరుగా మారతాయి. అయితే కోసిన వెంటనే కొంచెం మజ్జిగ కలిపిన నీటిలో వేసి ఉంచితే ముక్కలు అలా కాకుండా ఉంటాయి

అప్పాలు

                       మైదా -2 కప్పులు                                              బెల్లం తురుము - 1 కప్పు
                       బియ్యప్పిండి -1 కప్పు                                          ఎండు కొబ్బరి పొడి - 4 స్పూనులు
                       బొంబాయి రవ్వ -1 కప్పు                                       యాలకుల పొడి -1 స్పూన్
             విధానము: 
                       బొంబాయి రవ్వను జల్లించి గిన్నెలో వేయాలి.
                       మైదా,బియ్యప్పిండి లను కుడా జల్లించి రవ్వలో కలపాలి.
                       బెల్లం,కొబ్బరి తురుము,యాలకుల పొడి తగినన్ని నీళ్ళు పోసి గట్టిగ ముద్దగా కలిపి ఒక అరగంట ఉంచాలి.
                       అరగంట తర్వాత బెల్లం కరిగి పిండి కాస్త మెత్తబడుతుంది.
                       కొద్దిగా చేయి తడిచేసుకుంటూ చిన్న నిమ్మకాయంత పిండి ని తీసుకుని అర చేతి లో గుండ్రం గ చేసి బిళ్ళలు గ
                                        వత్తాలి.
                      కాగిన నూనె లో వేసి ఎర్రగా వేగాక తీయాలి  .   

చెక్కలు

                  బియ్యప్పిండి - 1 కప్పు                                 నానబెట్టిన పచ్చిసేనగపప్పు - 1 1/2 స్పూన్  
                 నీళ్ళు -  1 కప్పు                                        కరివేపాకు  
                 కారం - 1 స్పూన్                                        ఉప్పు
    విధానము:
             కప్పు నీళ్ళు తీసుకొని మరగబెట్టాలి.
            దానిలో ఉప్పు,కారం,బియ్యప్పిండి వేసి బాగా కలపాలి ఉండలు లేకుండా.
            ముఉత పెట్టి స్టవ్ ఆపేయాలి.
            చల్లరినాక నానబెట్టిన సెనగపప్పు,కరివేపాకు వేసి బాగా కలపాలి.
            బాండి లో నూనె వేసి బాగా కాగాక పిండి ను ఒక కవరు పైన చెక్క మాదిరి పల్చగా వత్తి నూనె లో ఎర్రగా కాల్చాలి.

గోధుమ రవ్వ-మైదా దోసెలు

                   నానబెట్టిన గోధుమరవ్వ-2 కప్పులు                                        పెరుగు -1 కప్పు
                  మైదా-2 కప్పులు                                                               ఉల్లి తరుగు
                 బియ్యప్పిండి-2 కప్పులు                                                       మిర్చి ముక్కలు
విధానము:
                  గోధుమ రవ్వ,మైదా ను నాలుగు కప్పుల నీళ్ళతో కలిపి రెండు గంటలు నానబెట్టాలి.
                  సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,పెరుగు వేసి బాగా కలపాలి.
                  పెనం పైన దోసె లాగ పోయాలి.
 
                 

మైదా దోసెలు

పుల్లమజ్జిగా -4 కప్పులు                                                 పచ్చిమిర్చి
మైదా-1 కప్పు                                                              ఉప్పు
బియ్యప్పిండి-2 కప్పులు                                                 జీర కొద్దిగా

విధానము:::
       మజ్జిగ లో మైదా,బియ్యప్పిండి కలిపి మూడు  గంటలు నానబెట్టాలి.
       మిర్చి,జీర దంచి ఉప్పు వేసి అందులో కలపాలి
      దోసేలగా పెనం మీద పోసి రెండు వైపుల కాల్చాలి..

ఆరోగ్యానికి చిట్కాలు

                                                          నొటిపూత వస్తే                                                                                              గ్లాసెడు గోరువెచ్చని నీళ్ళలో అయిదు చెంచాల ధనియాల పొడి వేసుకొని నోటిలో పోసుకొని పుక్కిలించాలి.
   ఇలా రోజుకు మూడు లేదా నాలుగు సార్లు చేస్తే తొందరగా నొటిపూత తగ్గుముఖం పడ్తుంది.
                                                        కడుపునొప్పి వస్తే       
   పిల్లలకు కడుపు నొప్పి వస్తే తులసి రసం లో కొంచెం సొంటిపొడి కలిపి ఇస్తే ఫలితం ఉంటుంది.
                                                       గొంతు నొప్పి వస్తే                          
   కొంచెం నీరు మరగ పెట్టి నిమ్మరసాన్ని కొంచెం ఉప్పు/పంచదార కాని కలిపి తాగాలి.
                                                     ఆకలి మందగిస్తే                         

బాంబినొ దొసె

కావలసిన పదార్ధాలు ::
బాంబినొ ---250గ్రాము
మజ్జిగ--1గ్లాస్
బియ్యపు పిండి-500గ్రాము
నునె--100గ్రాము
ఉల్లిపయలు-3
పచ్చి మిర్చి-10



తయారు చేయు పద్ధతి :
   బాంబినొ ఒక అర గంట ముందుగ మజ్జిగ లో నాన బెట్టాలి.
ఉల్లి,మిర్చి సన్నగా తరగాలి.
నానిన బాంబినొ ను మెత్తగా చిదమాలి.
దీనిలో బియ్యపు పిండి ,ఉల్లి,మిర్చి తరుగు,ఉప్పు కలిపి దోసె పిండి లా కొద్దిగా నీరు కూడా చేర్చి దోసె వేసుకోవాలి..