ఇడ్లి పిండి పల్చగా ఉంటే దానిలో కొద్దిగా బొంబాయి రవ్వ కలపాలి.
ఉప్మా తయారికి పోపు వేయించి నీళ్ళకు బదులు కాసిని పాలు పోస్తే రుచిగా ఉంటుంది.
పెరుగు పులిస్తే పారవేయకుండా వడకట్టి మళ్ళి గోరువెచ్చటి పాలు కలిపితే తాజా పెరుగు తయారు అవుతుంది. దోసె పిండి పులిస్తే దానిలో నాలుగు స్పూన్లు మైదా పిండి వేసి బాగా కలిపి దోసెలు వేస్తె కరకర లాడుతాయి.
దోసెల పిండి తో పాటు ఉడికించిన ఒక బంగాళదుంప ను కుడా వేసి రుబ్బితే దోసెలు రుచికరం గ ఉంటాయి.
మినప గారెలు ఎర్రగా దోరగా వేగాలి అంటే బాణలి లో వేసే ముందు చేతిని మజ్జిగ తో తడి చేసుకోవాలి.
చపాతీలు మృదువు గా ఉండాలి అంటే పిండి కలిపేటప్పుడు కొద్దిగా పాలు కలిపితే సరి.
దోసెలు పల్చగా రావాలి అంటే ఒక కప్పు సగ్గుబియ్యం నానబెట్టి వేసి రుబ్బాలి.
పూరీలు బాగా పొంగాలి అంటే గోధుమ పిండి తో చేస్తే కొంచెం మందం గ వత్తాలి
పూరీలు మైదా పిండి తో చేస్తే కొంచం పల్చగా వత్తాలి.
పకోడీలు/బజ్జీలు వండేప్పుడు సెనగపిండి కి 1 /2 కప్పు పెరుగు చేరిస్తే రుచి గా ఉంటాయి.
సేమ్యా ఉప్మా లో నీళ్ళు ఎక్కువగా ఉండి ముద్దగా ఉంటే కొంచెం బొంబాయి రవ్వ వేయాలి.
ఇడ్లీలు పులిసి వాసన రాకుండా రుచిగా ఉండాలి అంటే పిండి రుబ్బేటప్పుడు కొంచం నానిన సగ్గుబియం కలపాలి.
గారెల పిండిలో కొద్దిగా సేమ్యా వేయించి కలిపితే మంచి రుచిగా ఉంటాయి. తినేటప్పుడు గారెలు కరకరలాడుతాయి
అరటి కాయలు వంకాయలు కోసిన కాసేపటికే రంగు మారి కసరుగా మారతాయి. అయితే కోసిన వెంటనే కొంచెం మజ్జిగ కలిపిన నీటిలో వేసి ఉంచితే ముక్కలు అలా కాకుండా ఉంటాయి
0 comments:
Post a Comment