కావలసినవి:
మైదా.. రెండు కప్పులుబొంబాయి రవ్వ.. రెండు కప్పులు
పంచదార.. నాలుగు కప్పులు
నూనె.. వేయించేందుకు సరిపడా
వెన్న.. తగినంత
విధానము:
గిన్నెలో మైదా, రవ్వ, వెన్న వేసి తగినన్ని నీళ్లుపోసి చపాతీల పిండికంటే కాస్త పలుచగా కలుపుకోవాలి.ఆ మిశ్రమాన్ని అలాగే 10 నిమిషాలపాటు పక్కనుంచాలి.
తరువాత ఆ పిండిని తీసి ఓ మోస్తరు ఉండలుగా చేసి, రెండువేళ్ల మధ్యలో ఒక్కో ఉండను ఉంచి నొక్కుతూ పొడవాటి గోళ్లలాగా చేయాలి.
అలా మొత్తం పిండితో చేసుకున్నాక వాటిని బాగా కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించి పక్కనుంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పంచదార తీసుకుని, కాసిన్ని నీళ్లుపోసి ఉండపాకం వచ్చేలా చూడాలి.
ఈ పాకాన్ని పైన వేయించి పెట్టుకున్న వాటిపై పోసి బాగా కలియబెట్టాలి.
పాకం చల్లారేకొద్దీ వాటికి గట్టిగా పట్టుకుని తెల్లగా కనిపిస్తుంది. అంతే గోరు మీఠీలు తయార్..
0 comments:
Post a Comment