చేగోడీలు


కావలసినవి
              బియ్యపు పిండి - 3గ్లాసులు
              మైదా - 1గ్లాసు
              నెయ్యి - 50గ్రా
              వాము - 1/2టీస్పూను
              పసుపు - 1/4టీస్పూను
              కారం - 1/2టీస్పూను
              ఉప్పు - తగినంత
              నూనె - వేయించడానికి సరిపడినంత
విధానము :
           ముందుగా ఒక గిన్నెలో నాలుగు గ్లాసుల నీళ్ళు పోసి ఎసరు పెట్టవలెను.
           దానిలో తగినంత ఉప్పు వేసి ఎసరు మరిగిన తర్వాత స్టవ్ మీది నుంచి దించవలెను.
          ఇప్పుడు వాము,కారంపొడి,పసుపు వేసి వెంటనే మొత్తం బియ్యపుపిండి,మైదాలను కలిపి దానిపైన నెయ్యి పోసి గిన్నెపై మూతపెట్టవలెను.
           పిండి కొంచెం చల్లారిన తర్వాత పిండి ముద్దను రెండు అరిచేతులతో బాగా నలిపి సన్నగా తాడులా పొడవుగాచేసి కావలసిన సైజులో రింగులుగా అంటే గుండ్రంగా చేసి వేడినూనెలో ఎర్రగా వేయించి తీసేయవలెను

0 comments:

Post a Comment